calender_icon.png 15 October, 2024 | 5:00 AM

కారు నంబర్ ప్లేట్‌పై పేరు

15-10-2024 12:48:15 AM

మున్సిపల్ చైర్మన్ కుమారుడిపై కేసు

రాజేంద్రనగర్, అక్టోబర్ 14: కారు నంబర్ ప్లేట్‌పై తన పేరు రాసుకున్న రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ కుమారుడు కస్తూరి శ్రావణ్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నా యి.. మున్సిపల్ చైర్మన్ కస్తూరి న రేందర్ ముదిరాజ్ కుమారుడు శ్రా వణ్ తన ఫార్చునర్ కారు నంబర్ ప్లేట్‌పై కొంతకాలంగా ‘కస్తూరి శ్రావ ణ్.. టీం కేఎన్‌ఆర్’ అంటూ రాసుకొని తిరుగుతున్నాడు. ఈ విషయం నార్సింగి పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపి వాహనాన్ని సీజ్ చేసిన ట్లు నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రావణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.