అబుదాబి: భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో అబుదాబి వేదికగా జరగనున్న వరల్డ్ టెన్నిస్ లీగ్లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీ లో అనేక మంది స్టార్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ టోర్నీలో నాగల్ (83 ర్యాంక్) బరిలోకి దిగనున్నాడు. ఇక మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) కూడా బరిలోకి దిగనుంది.