calender_icon.png 23 September, 2024 | 2:50 AM

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నాగేశ్వర్

23-09-2024 12:56:06 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి డివిజన్ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్య క్షుడిగా బాశెట్టి  నాగేశ్వర్, జిల్లా కార్యదర్శిగా దుద్దల ప్రసాద్, కార్యవర్గ సభ్యుడిగా తాటిపల్లి రమేష్, సేవాదళ్ ఉపాధ్యక్షుడిగా పబ్బ యాదగిరిలను జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటుందని, జిల్లాలో ని ఆర్యవైశ్యులు హాజరుకావాలని సభ్యులు కోరారు.