calender_icon.png 30 September, 2024 | 10:08 PM

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన అక్కినేని నాగార్జున

04-09-2024 03:34:28 PM

హైదరాబాద్: ఇటీవల వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అక్కినేని కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వరద విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున ఏపీ, తెలంగాణ వరద సహాయ కార్యక్రమాలకు రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నామని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. త్వరగా ఈ విపత్తు నుంచి బాధిత ప్రజలు  కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్టు నాగార్జున తెలిపారు.