calender_icon.png 22 October, 2024 | 5:12 AM

రొమాన్స్ చేసే పాత్ర నాది

23-07-2024 12:05:00 AM

జాన్వీ కపూర్ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో రెండు రోజులుగా సందడి చేస్తున్నాయి. ఇందుకు కారణం ఫుడ్ పాయిజన్ కారణంగా జాన్వీ ఆస్పత్రి పాలు కావటం ఒకటైతే, రెండోది ఆమె సినిమాల విషయం. అదీగాక ఈ భామ గురించి సోషల్ మీడియా ట్రోల్స్ ఉండనే ఉన్నాయి. ఇలా ఈ ముంబయి ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తోంది. ట్రోల్స్ గురించి ఏమీ పట్టించుకోకుండా ప్రస్తుతానికైతే జాన్వీ ‘ఉలఝ్’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమా నుంచి తాజాగా సోమవారం ‘షాకన్’ అనే పెప్పీ ట్రాక్‌ను విడుదల చేశారు. జాన్వీ ఈ పాటలో కొత్తగా కనిపించింది. కుమార్ రాసిన సాహిత్యానికి శష్వాత్ సచ్‌దేవ్ స్వరాలు సమకూర్చగా, నేహా కక్కర్ ఆలపించారు.

సుధాంషు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఇటీవల ‘ఉలఝ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ పనిలో పనిగా టాలీవుడ్‌కు తాను పరిచయమవుతున్న ‘దేవర’ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో తెలిపింది. “దేవర’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ రొమాన్స్ చేసే రోల్ నాది. ఇప్పటికే ఎన్టీఆర్ సర్‌తో ఒక సాంగ్ చేశా. నెక్ట్స్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నా. షూటింగ్ చివరి దశలో ఉంది. ఫస్ట్ పార్ట్‌లో కన్నా రెండో భాగంలోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది” అని చెప్పుకొ చ్చిందీ భామ. సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న విమర్శలపై కూడా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడింది.

“సోషల్ మీడియా ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అది సోషల్ మీడియా కల్చర్. పబ్లిక్ ఫిగర్ అయినా, కాకపోయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఒక విషయంలో పొగిడిన వాళ్లే, అదే విషయంపై రేపు తిడతారు. ముక్కూమొకం తెలియనివాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవటం ఎందుకు? మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి” అంటూ స్ఫూర్తి వచనాలు చెప్పుకొచ్చింది జాన్వీ.