సినీ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు రెండు రకాలుగా ఉంటారు. కేవలం ఎక్స్పోజింగ్తోనే దూసుకెళ్లేవారు కొందరైతే.. నటనకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు కొందరు. నటనకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారిలో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా సాయి పల్లవి సరసన చేరిపోయింది. ఆమె మరెవరో కాదు ‘కల్యాణం కమనీయం‘ చిత్ర కథానాయిక ప్రియా భవానీ శంకర్.
కోలీవుడ్లో వరుస సినిమాలతో దుసుకెళుతోంది. ప్రస్తుతం ‘బ్లాక్‘ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ బ్యూటీ తన తాజా చిత్రం బ్లాక్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నా శరీరమేమీ వస్తువు కాదు. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్గా కనిపించాలనడం సరికాదు. అలాంటివి నాకసలు నచ్చదు.
నేనసలు అంగీకరించను. ఎప్పుడైనా కెరీర్లో వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఏ విషయంలోనూ బాధ పడకూడదనుకునే తత్వం నాది. ఈ క్రమంలోనే నా నిర్ణయాలు సైతం ఉంటాయి. ఫ్యాషన్ పేరిట కొన్నింటిని ప్రమోట్ చేయడం నాకు నచ్చదు. ఫేమ్ సొంతం చేసుకోవడానికి కొందరు గ్లామర్ను షార్ట్కట్గా భావిస్తూ ఉంటారు. నా వరకూ అది చాలా కష్టం. నేను దానిని సౌకర్యవంతంగా భావించలేను.
పైగా ప్రేక్షకులు కూడా నన్ను గ్లామర్ పాత్రలో చూసేందుకు ఇష్టపడరు” అని ప్రియా భవానీ శంకర్ మీడియాకు తెలిపింది. బాల సుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జీవా కథానాయకుడి పాత్రను పోషించారు. హారర్ జోనర్లో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.