calender_icon.png 27 September, 2024 | 3:14 AM

పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలి

25-09-2024 03:06:06 AM

టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలని టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు బీ కొండయ్య, డాక్టర్ సిల్వేరు మహేశ్ కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సీనియార్టీ ఆధారంగా పీజీటీలను ప్రిన్సిపాళ్లుగా, పీజీటీలకు సైడింగ్ నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు.