calender_icon.png 20 October, 2024 | 4:10 PM

రైలు ఢీకొని 180 మూగజీవాల మృతి

20-10-2024 12:30:00 PM

170 గొర్రెలు, 10మేకలు మృతి 

సుమారు రూ.15 లక్షల నష్టం 

ఆదుకోవాలని కోరుతున్నా రైతు

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలోని సిర్పూర్ టి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి మూగజీవాలపై రైలు దూసుకెల్లడంతో 180 నోరులేని జీవాలు మృత్యువాత పడ్డాయి. వర్షం పడటంతో  గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నా రైల్వే పట్టాలపై జీవాలు వచ్చి చేరుకున్నాయి. గుర్తు తెలియని రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్య రైతుకు చెందిన 170 గొర్రెలు,10 మేకలు మృతి చెందాయి. ఉదయం ఆ యజమాని లేచి చూసే సరికి రైల్వే పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్న గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంత మయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.