calender_icon.png 18 April, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

15-04-2025 06:35:34 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారం పై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై మండలాల తహసిల్దార్లు, నాయబ్ తహసిల్దార్లు, గిర్ధవార్లు, రెవెన్యూ సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో తీసుకువచ్చిన అంశాలు, హక్కులపై ప్రతి అధికారి ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భూ భారతి చట్టంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఏదైనా పట్టా మార్పిడి పై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ధరణి పోర్టల్ లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదని తెలిపారు. రాజస్వ మండల అధికారులకు అప్పీల్ చేసుకుని, అధికారి ఇచ్చిన జడ్జిమెంట్ పై కలెక్టర్ కు, సి. సి. ఎల్. ఎ. కు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.

విరాసత్, కొనుగోలు, గిఫ్ట్ డిడ్, పాలు పంపకం చేసుకునే దానిపై సంబంధీకులకు నోటీసులు జారీ చేసే వీలు ఉందని తెలిపారు. ప్రతి పట్టా మార్పిడికి సర్వేయర్లు మ్యాప్ జత పరచవలసి ఉంటుందని, ఇటువంటి అంశాలపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందుకుగాను ప్రతి రెవెన్యూ అధికారి చట్టంలోని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఎ. డి. సోమేశ్వర్, తహసిల్దారులు, నాయబ్ తహసిల్దార్లు, గిర్ధవార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.