జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి
చెన్నై, అక్టోబర్ 11: గోధ్వజ్ యాత్ర ప్రారంభించినప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు వ్యతిరేకిస్తారని భావించామని, అందుకు వారి గ్రంథాలు చదివి పూర్తి సిద్ధమయ్యామని జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ మమ్మల్ని వ్యతిరేకించిందని ఆరోపించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం గోధ్వజ్ స్థాపన చేసిన అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. గోధ్వజ్ యాత్రను అధికార బీజేపీనే వ్యతిరేకించడం తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా శనివారం పాండిచేర్చికి శంకరాచార్య స్వామీజీ వెళ్లనున్నారు.