ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్ల ప్రశ్నలు
క్లారిటీ ఇచ్చిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. ఆ ఫొటోల్లో వారిద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ ముచ్చటించుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వీరు డేట్కు వెళ్తారని అనుకుంటు న్నారా?’ అని ఎక్స్లో పోస్టు పెట్టగా.. మస్క్ అతడి పోస్టుకు స్పంది స్తూ ‘మేమిద్దరం డేటింగ్లో లేం’ అని స్పష్టం చేశారు. కాగా మంగళవారం న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ చేతుల మీదుగా మెలోనికి అందజేశారు.
ఈ సందర్భంగా మస్క్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మెలోనీకి అవార్డు అందజేయడం నేను గర్వంగా భావిస్తున్నా.. ఆమె బాహ్య సౌందర్యం కన్నా.. మనసు మరింత అందమైంది. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను నేను వాడదలుచుకోలేదు. అయితే మెలోనీ అలా కాదు. ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తి’ అని మస్క్ అభివర్ణించారు.