calender_icon.png 24 October, 2024 | 3:58 AM

మూసీ ఆక్రమణలపై దృష్టి పెట్టాలి

28-08-2024 12:13:13 AM

ఎల్బీనగర్, ఆగస్టు 27: హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో జరిగిన ఆక్రమణలపై దృష్టి పెట్టాలని కోరుతూ కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్ మంగళవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్తపేట డివిజన్‌లోని తెలంగాణ పార్కు రామలింగేశ్వర కాలనీ పక్కన 1980లో సర్వేనంబర్లు 143, 146, 159, 160లో సుమారు 3.12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉడేదని, ఇప్పుడు 19 గుంటల భూమి మాత్ర మే మిగిలిందన్నారు.