calender_icon.png 27 September, 2024 | 2:52 PM

మూసి బాధితుల ఆందోళన.. స్తంభించిపోయిన వాహనాలు

27-09-2024 12:58:54 PM

కార్వాన్: మూసీ నది అభివృద్ధి పనుల వల్ల ముంపునకు గురవుతున్న లంగర్ హౌజ్ వాసులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలో మీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. 30 ఏళ్లుగా తాము మూసి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నామని.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి తమ ఇళ్ళను అప్పగించేది లేదని లంగర్ హౌస్ డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ వాసులు రింగ్ రోడ్ లోని 102 పిల్లర్ నెంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో తాము గూడు లేని వారం అవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్లను ఇవ్వమని స్పష్టం చేశారు. అనంతరం లంగర్ హౌస్ లోని గోల్కొండ ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ అహల్యకు వినతిపత్రం అందజేశారు.