calender_icon.png 15 October, 2024 | 6:55 AM

పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో హత్యలా?

15-10-2024 12:21:47 AM

మావోయిస్టులపై ఆదివాసీ సంఘాల ఫైర్

భధ్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతా ల్లో మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుల వరుస హత్యలకు పాల్పడుతున్నారని ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి. సో మవారం భద్రాచలం డివిజన్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మావోయిస్టుల చర్యలను తీ వ్రంగా ఖండించాయి.

అక్టోబర్ 4న బోడ్‌కెల్‌కు చెందిన భార్సే ఎర్రాను ఇన్‌ఫార్మర్ పేరుతో హత్యచేశారని, అక్టోబర్ 5న మృతుడి సోదరుడైన బర్సే భీమాను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కిడ్నాప్ చేసిన గ్రామస్థు లను తక్షణమే విడుదల చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి.