హుజూరాబాద్, అక్టోబరు 5: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు(30) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం అతడి తల్లిదండ్రులు నోముల చంద్రయ్య, ఎల్లమ్మ తమ కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు విగతజీవిగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమి చ్చా రు.
హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ తిరుమల్గౌడ్, ఎస్సై యూ నస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నోముల రాజు నుదుటిపై ఆయుధం తో కొట్టిన గాయాలుండటం, మంచం చుట్టూ రక్తం మరకలు ఉండటంతో హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడు అంజిని విచారిస్తున్నారు.