calender_icon.png 11 October, 2024 | 2:55 PM

పాతకక్షలతో వ్యక్తి హత్య

11-10-2024 12:18:23 AM

చార్మినార్, అక్టోబర్ 10: పాతకక్షల కారణంగా వ్యక్తి హత్యకు గురైన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వట్టేపల్లి ఫాతిమా నగర్‌లో నివసించే సాజీద్ (38)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నా రు. అతను స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సిద్ధిఖ్ (22)తో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.

మూడేళ్ల క్రితం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగగా.. స్నేహితుల ద్వారా రాజీపడ్డారు. కాగా, సిద్ధిఖ్ ఈ నెల 9న రాత్రి 10.30 గంటల సమయంలో అమ్జదుల్లాకాలనీలో ఉన్న సాజీద్ వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. పాతకక్షను మనసులో పెట్టుకున్న సిద్దిఖ్.. తన వద్ద ఉన్న కత్తితో సాజీద్‌పై దాడి చేసి పారిపోయాడు.

సాజీద్ రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండటం చూ సిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటహుటిన ఘట నా స్థలానికి చేరుకున్న ఫలక్‌నుమా ఏసీపీ ఎల్‌ఎన్‌ఎల్ రాజు, ఇన్‌స్పెక్టర్ యాదిరెడ్డి బృందం సాజీద్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికి త్సపొందుతూ మృతిచెందాడు. సిద్దిఖ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.