కందుకూరు మండలం కొత్తగూడలో దారుణం
మహేశ్వరం, అక్టోబర్ 16: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి లోని కొత్తగూడ వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని దుండగులు వృద్ధ్ద దంపతులను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికం గా కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా ముష్ఠిపల్లికి చెందిన ఉషయ్య (55), శాంతమ్మ (50) దంపతులు.
వీరికి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్లుగా దంపతులిద్దరూ.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లోని కొత్తగూడలో మనోహర్రావుకు చెందిన మామిడితోట (10 ఎకరాలు)లోని వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ అందులోనే నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రం యజమాని..
ఫాంహౌజ్లో పనిచేసే వృద్ధ దంపతులకు ఫోన్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో గ్రామంలో నివసించే తెలిసిన వ్యక్తికి ఫోన్చేసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడమని కోరగా ఆ వ్యక్తి వ్యవసాయక్షేత్రానికి వెళ్లి చూడగా.. వృద్ధ దంపతులు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. విషయాన్ని వ్యవసా య క్షేత్రం యాజమానికి చెప్పటంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పాత కక్షలే కారణమా..!
మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్స్పెక్టర్ సీతారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంతో పాటు డాగ్స్కాడ్ బృం దాలు రంగంలోకి దిగాయి. పాతకక్ష్యల కారణంగా హత్య జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి.. నాలుగు పోలీస్ బృందాలను మృతుల స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా ముష్ఠి గ్రామానికి పంపించారు.
అదనపు డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా హత్యలకు పాల్పడిన దుండగులను పట్టుకుంటామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కేసును కందుకూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.