calender_icon.png 30 September, 2024 | 3:03 AM

నిజామాబాద్‌లో యువకుడి హత్య

30-09-2024 12:48:47 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరం లోని రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడ్ని చంపి మృతదేహాన్ని స్టేష న్ సమీపంలో పడేసి వెళ్లిన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ త్రి టౌన్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నవిపేట్ మండల కేంద్రానికి చెందిన గణేష్(30) నిజామాబాద్ నగరంలో తన అక్క, బావలతో కలిసి నివసిస్తున్నాడు.

గణేష్‌కు వివాహమైనా భా ర్యతో గొడవల కారణంగా వేరుగా ఉ ంటున్నాడు. శనివారం గణేష్ భార్య తరఫు బంధువులు నిజామాబాద్ వ చ్చి గణేష్‌తో మాట్లాడుతామంటూ తీసుకెళ్లారు. ఆ తర్వాత గణేష్ తిరిగి రాలేదు. రైల్వే స్టేషన్ సమీపంలో ఆ దివారం హత్యకు గురై విగత జీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గణేష్ భార్య తరఫువారే చంపి ఉంటారని గణేష్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.