calender_icon.png 29 October, 2024 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి హత్య

29-10-2024 02:57:22 AM

కూకట్‌పల్లి, అక్టోబర్ 28: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సీఐ నరసింహ రాజు కథనం ప్రకా రం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్‌కుమార్ (21) నగరానికి వలస వచ్చి పంచశీల కాలనీలో నివాసం ఉంటూ ఓ కంపెనీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు రాజ్‌కుమార్‌ను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు, వీపుపై కత్తితో పొడిచి హత్య చేశారు.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు.