calender_icon.png 23 October, 2024 | 2:59 PM

రియల్టర్ హత్య

11-07-2024 12:06:14 AM

రాజేంద్రనగర్, జూలై 10: బండ్లగూడ జాగీర్ ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన రియల్టర్ కమ్మరి కృష్ణ షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫాంహౌస్‌లో ఉండగా, బుధవారం అతని బాడీ గార్డు బాబా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఏసీపీ రంగస్వామి తెలిపారు. షాద్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.