calender_icon.png 21 September, 2024 | 2:08 AM

మున్నూరు కాపు సంఘం వరంగల్ ఇన్‌చార్జిగా గోపి

20-09-2024 12:29:16 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మున్నూరుకాపు సంఘం వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర కార్యదర్శి, మహబూబూబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన చందా గోపి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో రాజ్యసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులను 33 జిల్లాలకు ఇన్‌చార్జులుగా నియమించారు. వరంగల్ ఇన్‌చార్జిగా నియమి తులైన చందా గోపికి మాజీ మంత్రి జోగు రామన్న, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు విఠల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ తదితరులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియమాకానికి సహకరించిన మున్నూరుకాపు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.