29-03-2025 08:22:53 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ బి. శ్రీహరి రాజు. మాట్లాడుతూ ప్రస్తుతం రోజురోజుకు ఎండ వేడిమి ఎక్కువ అవుతున్నందున పాదాచారులకు వాహనదారులకు దప్పిక తీర్చేందుకు తమ వంతు బాధ్యతగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.