calender_icon.png 17 October, 2024 | 12:27 AM

బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయొద్దు

16-10-2024 08:57:52 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మునిసిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ పలు సూచనలు చేశారు. 31 వార్డులోని నాసార్ పురలో చెత్త వాహనం సరైన సమయానికి రావడం లేదన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ అశ్రిత్ కుమార్ నేరుగా సంబంధిత ప్రాంతానికి వెళ్లి వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్, చెత్త వాహనం డ్రైవర్ లని పిలిపించి, తప్పనిసరిగా ప్రతిరోజు చెత్త వాహనం సమయానికి రావాలని ఆదేశించారు. సమయానికి చెత్త వాహనం రాకపోవడం వలన గృహనివాసతులు ఇంట్లో వెలువడినటువంటి చెత్తను బహిరంగ ప్రదేశంలో వేసే అవకాశం ఉంటుందని కావున తప్పనిసరిగా ప్రతి ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు.

ఇందిరమ్మ కాలనీలో కమిషనర్ పర్యటించారు. కాలువ నుండి దుర్వాసన వస్తుందని కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఇళ్ల వద్ద ఉన్న మురికి కాలువలోని చెత్త ,సిల్ట్ తొలగించి మురికి కాలువల పైన ఉన్నటువంటి స్లాబ్ నిర్మాణం వలన మురికి కాలువలో చెత్తను,సిల్ట్ ను తొలగించుటకు సమస్యగా ఉందాని, స్లాబ్ నిర్మాణాలు తొలగించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.  ఇంట్లోని పేపర్లు ,కవర్లను బహిరంగ ప్రాంతాల్లో వేయడం వలన అది గాలికి మురికి కాలువలో పడి నీటి సరఫరా కు సమస్యను కలిగిస్తాయని కావున ఇళ్లలో వెలుపడేటువంటి చెత్తను బహిరంగ ప్రాంతాల్లో వేయకుండా ఉదయాన్నే వచ్చే మున్సిపల్ చెత్త వాహనానికి అందజేయాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. కుశాల్ నగర్ లో ఇళ్ల మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలు, చీదు తొలగించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.