మైసూరు, అక్టోబర్ 16: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో ముడా చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్లు బుధవారం ఆయన తెలిపారు. 1983 నుంచి సీఎ సిద్ధరామయ్యకు మరిగౌడ అత్యంత సన్నిహిత మిత్రుడిగా కొనసాగుతున్నారు. గతంలో సిద్ధరామయ్య సహకారంతో ఆయన వివిధ పదవుల్లో కొనసాగారు.
కాగా మరిగౌడ రాజీనామపై సీఎం సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు. ముడా నుంచి సీఎం భార్య పార్వతి అక్రమంగా విలువైన 14 ప్లాట్లను తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గవర్నర్కు పలువురు ఫిర్యాదు చేయడంతో సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు.
ముడా స్కాంలో సిద్ధరామయ్యపై ఈడీ , లోకాయుక్త కేసులు పెట్టి విచారణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంకు మరిగౌడ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయన కూడా అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శించాయి.