నార్సింగి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ఫీఎస్ నేత నరేంద్ర అదృశ్యం అయ్యారు. బుధవారం మధ్యామ్నం స్నేహితుడితో కలిసి నరేందర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. నరేందర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు నలుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.