calender_icon.png 23 October, 2024 | 4:53 AM

ఎంపీడీవోల సంఘం ఎన్నిక

29-07-2024 12:43:40 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం టీజీవోస్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ తెలిపారు. టీఎంపీడీవో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా టీ శ్రీనివాస రావు, కార్యదర్శిగా జే పద్మావతి, కోశాధికారిగా సయ్యద్ తారిఖ్ అన్వర్, సహా అధ్యక్షులుగా కే ధన్‌సింగ్, ఉపాధ్యక్షులుగా ఎం మోహన్, జే సంతోష్, బీ మల్లికార్జున్, భారతి, జాయింట్ సెక్రటరీలుగా బాలరాజు రెడ్డి, టీ వాణి, దివ్య దర్శనరావు తదితరులను ఎన్నుకున్నట్టు ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. 

టీజీవో సిటీ బ్రాంచ్ అధ్యక్షుడిగా వెంకట్ గండూరి.. 

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ సిటీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం టీజీవో కార్యాలయంలో జరిగాయి. హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడిగా వెంకట్ గండూరి, కార్యదర్శిగా నిరంజన్ రెడ్డి, కోశాధికారిగా స్వర్ణలత, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శిరీష, ఉపాధ్యక్షులుగా బాబు బేరి, లావణ్య, వినోద్ రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీగా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివకుమార్, కల్చరల్ సెక్రటరీగా యశోద, పబ్లిసిటీ సెక్రటరీగా యాదగిరి, కార్యాలయ కార్యదర్శిగా ప్రభాకర్ శ్రీవాత్సవ, గంగిరెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఎస్ వెంకటేశ్వర్లు, సముజ్వల, బీ వెంకటేశ్వర్లు, సైదులు, స్వరూపరాణిని ఎన్నుకున్నారు.