24-03-2025 04:35:31 PM
నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాలకు కార్యాలయానికి వచ్చిన ప్రజలకు దాహార్తి తిర్చడానికి వాటర్ ప్యూరిఫై సోమవారం ఎంపీడీవో మహేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల అవసరల సౌకర్యం కోసం మండల ప్రజా పరిషత్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది అందరూ కలిసి వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేశామన్నారు. సహకరించిన సిబ్బందికి ఎంపీడీవో మహేశ్వర రావు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ ఇందిరమ్మ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.