మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమత్తు పనులను ఎంపీడీఓ ఎన్ రాజేశ్వర్ పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో, గ్రామంలోని పోచమ్మ గుడి దగ్గర రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిని గుంతలమయం అయ్యాయి. దీంతో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరీష్, కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్, బొజ్జ రాములు, బేర సమ్మయ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.