calender_icon.png 16 October, 2024 | 9:57 PM

బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఎంపీ లక్ష్మణ్

16-10-2024 02:30:24 AM

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్‌ను ఆపార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ మంగళవారం పార్టీ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొద్ది రోజుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీస ర్ల నియామకం చేపట్టారు. కోరిటర్నింగ్ అధికారులుగా ఎంపీలు నరేశ్ బన్సల్, డా. సంబిత్ పాత్రాతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖా వర్మను నియమించారు.