17-04-2025 10:39:24 PM
ఆదివాసుల సమస్యలపై గవర్నర్ కు వినతి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కలిసారు. హైదరాబాదులో గురువారం జిల్లాకు చెందిన ఆదివాసీలతో గవర్నర్ ను కలిసిన ఎంపీ శాలువా పూలబొకే తో సత్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలోని సివిల్ కేసుల అధికారం ఐటీడీఏ పీవో లకే ఉండాలని, రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశం జరపాలని కోరారు. ఐటిడిఏ గవర్నమెంట్ బాడీ సమావేశాలు జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సార్ మెడీ మెస్రం దుర్గు, పెందుర్ గోపి, పెందురు ప్రభాకర్, కొమరం అటల్ రావు, అరక వసంతరావు, గిరి, జమర్ తదితరులు పాల్గొన్నారు.