11-02-2025 02:23:14 PM
మందమర్రి,(విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ జన్మదినం వేడుకలు మందమర్రి(వి) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకులు పెద్ది అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడే వ్యక్తి వంశీ అని కొనియాడారు. అనంతరం కేకు కోసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఐత కమల్, బైరినేని చంద్రశేఖర్, రెడ్డి ఆకాష్, గుండం అంజి, హరిప్రసాద్, కూన కృష్ణ, మనుబోతుల సంపత్, ఐద చింటూ, పెద్ది విక్రమ్, పాలమా కుల మల్లికార్జున్, మహేష్, భునేని తిరుపతి, నరేష్,రెడ్డి కృష్ణ, అట్టెం అఖిల, కూన సురేష్ లు పాల్గొన్నారు.