calender_icon.png 27 September, 2024 | 6:48 PM

నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు: ఎంపీ ఈటల

27-09-2024 03:12:53 PM

హైదరాబాద్: హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని విమర్శించారు. నోటీసులు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామన్నారు. నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.