దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
హనుమకొండ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. గత నాలుగు రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నరేశ్రెడ్డి మృతి మహబూబాద్ జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. నరేశ్రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరేశ్రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి, వరంగల్ ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. నూకల నరేశ్రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.