11-03-2025 01:14:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): లక్ష్యం దిశగా ముందుకు సాగాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నాఠూబాద్ కవాడిగూడలో గల అన్నం కాంప్లెక్స్లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘లక్ష్యం యూట్యూబ్ ఛానెల్’ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు.
అం ముందు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్ మహ్మద్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్య విమలక్క, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ మా చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి ‘లక్ష్యం’ యూట్యూబ్ ఛానెల్ను లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ.. పదేండ్లలో తెలంగా యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఎ ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ కోసం కపిలవాయి దిలీప్కుమార్ ఎంతో పోరాడారన్నారు.
దిలీప్కుమార్ నే లక్ష్యం ఛానెల్ క్రమంగా ముందు సూచించారు. విమలక్క మాట్లాడుతూ ఏగమ్యాన్ని చేరుకో లక్ష్యం ముందుకు సాగాలన్నారు.
యువతకు ఉచిత సబ్స్క్రిప్షన్, శిక్షణ: దిలీప్కుమార్
నిరుద్యోగ యువత కోసం తన సారథ్యంలోని లక్ష్యం యూట్యూబ్ ఛానెల్ సేవలం మాజీ ఎమ్మెల్సీ, లక్ష్యం యూ ఛానెల్ చైర్మన్ కపిలవాయి దిలీప్కుమార్ తెలిపారు. తమ ఛానెల్లో ఉద్యోగార్థులకు అవసరమైన కెరీర్ గైడెన్స్ క్లాసులు, ప్రముఖుల సలహాలు, సూచనలు, మోటివేషన్ స్పీచ్లు, వర్తమాన రాజకీయ పరిస్థితు సహా పలు అంశాలపై వీడియో సందేశా ఉంటాయని చెప్పారు. వీటి కోసం తమ ఛానెల్కు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తిగా ఉచిత సబ్స్క్రిప్షన్ ఉం తెలిపారు.
ఆసక్తి గల వారు తమ కార్యాలయంలో తరగతులకు కూడా హాజరు కావచ్చని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి సేవలందించాలనుకునే యువత తమను సంప్రదిస్తే సామాజిక సేవపై వారికి అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ప్రతీ రెండు నెల జాబ్మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తాని పేర్కొన్నారు. తనను రెండు ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తెలంగాణ సమాజానికి సేవ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.