calender_icon.png 27 October, 2024 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి, పిల్లల మృతిపై వీడని అనుమానాలు

29-05-2024 12:20:38 PM

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లి, పిల్లల మృతిపై అనుమానాలు ఇంకా వీడలేదు. కారు చెట్టును ఢీకొని తల్లి కుమారి, పిల్లలు కృషిక, తనిష్క మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న భర్త బోడా ప్రవీణ్ కు గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ వాళ్లను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో తల్లి, పిల్లల మృతదేహాలు ఉన్నాయి. శవపరీక్ష నివేదిక వచ్చాకే ప్రమాదమా, హత్య అనేది తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.