calender_icon.png 9 October, 2024 | 5:48 PM

సరస్వతి అవతారంలో అమ్మవారు

09-10-2024 03:51:06 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పెద్దనపల్లి ఏరియాలో ఉన్న శ్రీదుర్గా మందిర్ లో 6వ రోజు బుధవారం అమ్మవారు సరస్వతి  అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత దర్శించుకున్నారు. 11వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల శ్రీధర్, వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.