calender_icon.png 8 October, 2024 | 8:17 PM

శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు

08-10-2024 01:17:37 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): తాండూరు మండలంలోని బోయపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చింది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని పూలతో అలంకరించి మహిళలు కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి మహిళలు తీరొక్క నైవేద్యాలు సమర్పించారు.