calender_icon.png 23 October, 2024 | 2:31 AM

ఆస్తి కోసం కక్కుర్తి.. రెండు రోజులుగా ఇంట్లోనే కన్నతల్లి మృతదేహం

17-05-2024 04:11:55 PM

నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో అనాగరిక ఘటన వెలుగుచూసింది. కన్న పాపానికి కొడుకు, కూతుర్లు ఆస్తి కోసం 2 రోజులుగా తల్లి అంతక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. సూర్యాపేటలో లక్ష్మమ్మ(80) అనారోగ్యంతో చనిపోగా ఆమె పేరు మీద ఉన్న 21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం కోసం కక్కుర్తి పడ్డారు. లక్ష్మమ్మ పేరు మీద ఉన్న ఆస్తుల పంపకంలో కొడుకు, కూతుర్ల మధ్య వివాదం నెలకొంది. ఈ పంచాయితీ తెగకపోవడంతో లక్ష్మమ్మ మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్‌లో పెట్టారు. స్పందించిన గ్రామస్తులు కొడుకు, కుతుర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.