ముంబై: 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ రెండు క్యాటగిరీల్లో స్వర్ణాలు సాధించి కొత్త చరిత్రను లిఖించిన సంగతి తెలిసిందే. ఈ విజయాలపై మాజీ చెస్ చాంపియన్ విశ్వ నాథన్ ఆనంద్ స్పందించా డు.‘ఒలింపియాడ్లో స్వర్ణాలు గెలవడం చాలా సంతోషాన్ని చ్చింది. భారత్లో మహిళల చెస్కు ఇది ఎంతో దోహదపడుతుంది. మహిళలు చెస్లో ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. కాబ ట్టి వారు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది’ అని అన్నారు. పురుషుల జట్టు ఇటీవల ఎన్నో విజయాలు సాధించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. కానీ మహిళలు ఒత్తిడిని తట్టుకొని స్వర్ణం సాధించడం గొప్ప విషయం.