calender_icon.png 27 October, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు..?

03-07-2024 12:05:00 AM

బాలయ్య నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయనున్నారన్న వార్త ప్రస్తుతం అంతటా వినవస్తోంది. నిజానికి ఈ కబురు ఎన్నాళ్ళుగానో అటు అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ నానుతున్నదే. అటు బాలయ్య సైతం ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగ వేదికల్లో ప్రస్తావించినప్పటికీ ఎప్పుడు.. ఎవరితో..  వంటి విషయాల్లో స్పష్టత లేకుండా పోయింది. కాగా నిన్నటికి నిన్న స్టులిష్ లుక్‌లో మోక్షజ్ఞకి సంబంధించిన ఫొటోలు కొన్ని ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. మోక్షజ్ఞ ఈ సరికొత్త అవతారం సినిమాల కోసమే అని తీర్మానించుకున్న చాలా మంది ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందని సంబరాలు ఆరంభించారు.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడం.. బాలయ్య వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆయన కుమార్తెలు కూడా వ్యాపార రంగాల్లో రాణిస్తున్న తరుణంలో మోక్షు తెరం గేట్రానికి ఇదే సరైన సమయమని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ కుమార్తె అయిన తేజస్విని నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ నందమూరి వారసుడి తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్న వారిలో ప్రశాంత్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

బాలయ్య వర్మ కలిసి ‘అన్‌స్టాప బుల్’ కార్యక్రమానికి పనిచేసిన నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య మంచి అనుబం ధం ఉంది. తేజ లాంటి యంగ్ హీరోతో ‘హనుమాన్’ లాంటి భారీ సినిమా చేశా రు ప్రశాంత్. ఈ నమ్మకంతోనే దర్శకత్వ పగ్గాలు ఆయనకు అందించే ఆలోచనలో ఉన్నారట బాలయ్య. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ మోక్షజ్ఞ ఎంట్రీకి సరైన చిత్రమని భావించిన బాలకృష్ణ ఈ మేరకు కథ కూడా తానే సిద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఇప్పుడు అదే కథని ప్రశాంత్ మల్టీస్టారర్‌గా రూపొందించనున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం జరగనుందన్నది వేచి చూడాల్సిందే!