హైదరాబాద్: నగర శివారులోని జన్వాడలో వ్యాపారి రాజ్ పాకాల ఫాంహౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ పాకాలకు మోకిల పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఫాంహౌస్ పార్టీ కేసులో ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రాజ్ పాకాలకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్, కేసు సంబంధిత ఆధారాలు సమర్పించాలని పోలీసులు వివరించారు. విచారణకు రాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వెల్లడించారు.