07-04-2025 01:00:03 AM
భీమదేవరపల్లి ఏప్రిల్ 6 విజయ క్రాంతి అన్ని రేషన్ షాపుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఆదివారం బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం నరేంద్ర మోడీ ఇస్తుంటే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క కిలో కి 40 రూపాయలు వెచ్చించి ప్రజలకు అందిస్తున్నా నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం శోచనీయం అన్నారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోను మాత్రమే పెట్టడం చాలా బాధాకరం అన్నారు.
భీమదేవరపల్లి మండలంలో రేషన్ షాపుల ముందు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాలని మండల ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ ను మేము అడగగా మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవన్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచి అని చెప్పడం మాకు సమాధానం కూడా కరెక్ట్ గా లేకపోవడం వలన కొన్ని రేషన్ షాపుల ముందు వెళ్లి ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది.
అదేవిధంగా సానుకూలంగా అర్థం చేసుకున్న రేషన్ డీలర్లతో నరేంద్ర మోడీ ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టి ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి తప్ప అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజలను మభ్య పెట్టడం కరెక్ట్ కాదన్నారు రాబోయే రోజులలో అన్ని గ్రామాల ముందు నరేంద్ర మోడీ ఫోటో ప్రభుత్వం కేటాయించకపోతే. భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ద్వారా అన్ని రేషన్ షాపుల ముందు ఫోటోలు నరేంద్ర మోడీ గ పెడతామని కాంగ్రెస్ పార్టీ నీ హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృధ్విరాజ్, సీనియర్ నాయకులు దొంగల కొమరయ్య. ప్రధాన కార్యదర్శి గుండెల్ని సదానందం,మండల ఉపాధ్యక్షులు దొంగల వేణు, ఓబీసీ ముర్చా అధ్యక్షులు దొంగల రాణా ప్రతాప్, శక్తి కేంద్రం ఇన్చార్జులు బైరి సదానందం, శనిగరపు ఐలయ్య, కాలేరు వికాస్, బొల్లంపల్లి శ్యామ్, బొజ్జపురి పృథ్వీరాజ్, కత్తుల విజయ్, పట్ల అఖిల్ తదితరుల పాల్గొన్నారు.