calender_icon.png 9 October, 2024 | 11:01 AM

సుత్తితో మోది భార్య హత్య

09-10-2024 01:25:38 AM

అనంతరం పోలీసులకు లొంగిపోయిన భర్త

రాజేంద్రనగర్, అక్టోబర్ 8: అది నార్సిం గి పోలీస్ స్టేషన్. మంగళవారం ఉదయం ఓ వ్యక్తి తన పిల్లలను తీసుకొని స్టేషన్‌కు వచ్చా డు. విషయం ఏంటని పోలీసులు వాకబు చేశారు. అయితే, అతడు చెప్పిన సమాధా నం విని ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ‘సార్.. నా భార్యను సుత్తితో కొట్టి చంపేశాను’ అం టూ చెప్పడంతో అవాక్కయ్యారు.

వివరాలి లా ఉన్నాయి.. హైదర్షాకోట్ మాధవి నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, కృష్ణవేణి (32) భార్యాభర్తలు. శ్రీనివాస్ తన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఓ టెం ట్‌హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. హైదర్షాకోట్ నుంచే దేవరక ద్రకు రాకపోకలు సాగిస్తుంటాడు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

కొంతకాలంగా శ్రీనివాస్ భార్యను వేధిస్తున్నాడు. తన ను నిర్లక్ష్యం చేస్తోందని, చెప్పిన మాట వినకుండా పెడచెవిన పెడుతోందని కక్షపెంచుకు న్నాడు. గొడవల నేపథ్యంలో కృష్ణవేణి పలుమార్లు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి దంపతులు తమ పిల్లలతో కలిసి నిద్రించారు.

అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటలకు శ్రీనివాస్ సుత్తితో భార్య తలపై మోదడంతో ఆమె చనిపోయింది. మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యను చంపేశాను అంటూ చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యా ప్తు చేస్తున్నారు. అయితే, తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లనున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు.