20-04-2025 12:44:11 AM
ఏప్రిల్ 22, 23 తేదీల్లో పర్యటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. సౌదీ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేర కు ఈ నెల 22, 23 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికా రికంగా ధ్రువీకరించింది.
జెడ్డా నగరంలో మోదీకి సౌదీ రాజు స్వాగతం పలకనున్నా రు. ఈ ఇద్దరు నేతలు ‘స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్’ రెండో సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ అధికారులు ఆశా భావం వ్యక్తం చేశారు.