27-03-2025 12:20:28 AM
ఆలయంలో ప్రత్యేక పూజలు
వంతెన ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: శ్రీరామనవమి(ఏప్రిల్ 6న) రోజున ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శించనున్నారు. రామనాథస్వామి ఆలయంలో పూజలు చేయడంతో పాటు పంబన్ వంతెనను కూడా ప్రారంభిస్తారు. 2.10 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన దేశంలోని ప్రధాన భూభాగంలోని మండపాన్ని పంబన్ ద్వీపంలోని రామేశ్వరంతో కలుపుతుంది. తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ వంతెనను అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఈ వంతెన మధ్యలో భారీ ఓడలు వచ్చినప్పుడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. బ్రిటిష్ కాలం నాటి పాత పంబన్ వంతెన స్థానంలో ఈ కొత్త వంతెన అందుబాటులోకి రానుంది. ఈ వంతెనకు 2019లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.