calender_icon.png 9 October, 2024 | 9:54 PM

మోదీ మాట నిలబెట్టుకోవాలి

09-10-2024 01:04:26 AM

ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్, అక్టోబర్ 8: ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని గౌరవనీయమైన వ్యక్తి. జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. దానిని నిలబెట్టుకుంటారనే భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి విజయం సాధించటంతో ఒమర్ అబ్దుల్లా రెండోసారి సీఎం కాబోతున్నారు.