బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ వంద రోజుల పాలన వికసిత భారత్కు బలమైన పునాదులు వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. అవినీతి, బంధుప్రీతితో విసుగు చెందిన దేశ ప్రజలు 2014లో మోదీకి అధికారం అప్పగించారని, నాటి నుంచి నేటి వరకు వేగవంతమైన నిర్ణయాలు, సంస్కరణలతో దేశాభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో మౌలిక వసతుల కల్పనకు మోదీ అగ్రతాంబూలం ఇస్తున్నారని పేర్కొన్నారు. శత్రుదేశాలు కూడా భారత్ను పొగిడేలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా శాంతి మంత్రాన్ని బోధించే మహాశక్తిగా భారత్ను తీర్చిదిద్దారన్నారు.