calender_icon.png 26 March, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ పరీక్షలు విద్యార్థుల భయాన్ని తొలగిస్తాయి

23-03-2025 03:53:14 PM

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షలకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రస్తుతం పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తేనే మంచి కళాశాలల్లో సీటు పొందడం జరుగుతుందని విద్యార్థులకు సూచించారు. ఈ పరీక్ష నిర్వహించడానికి సహకరించిన ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి(RK Educational Institutions CEO Jaipal Reddy)కి కృతజ్ఞతలను తెలిపారు.

ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్(Mathematics Teacher Jaligama Srikanth) మాట్లాడుతూ... చిన్న వయసులోనే లక్షల రూపాయల ప్యాకేజీని ఇంజనీరింగ్ విద్యార్థులు పొందుతున్నారని దాని కోసం సరియైన గైడెన్స్ తీసుకుని విద్యార్థులు జీవితాలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని అన్నారు.పరీక్ష అంటే భయాన్ని వదిలి అనుకూల వాతావరణం పెంపొందించుకుంటే ఉన్నత స్థాయి ర్యాంకులు సాధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే ప్రిన్సిపాల్ దత్తాద్రి,కోఆర్డినేటర్ నవీన్,టీఎన్ఎస్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అంజల్ రెడ్డి,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్,ఉపాధ్యక్షులు వెంకటరమణ,గంప ప్రసాద్ అధ్యాపకులు గోవర్దన్ రెడ్డి,శ్రీధర్,మహేష్ నరేష్,ధర్మపురి,శేఖర్,నవీన్,శ్రీ వాణీలు పాల్గొన్నారు.