calender_icon.png 21 September, 2024 | 11:57 AM

996 మంది ఆకతాయిలు అరెస్ట్

21-09-2024 12:15:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఇటీవల మహిళలు, యువతులపై వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యం లో మహిళలకు మేమున్నామని భ రోసా కల్పిస్తున్నాయి షీ టీమ్స్. తా జాగా వినాయక ఉత్సవాల సందర్భంగా 11 రోజుల్లో ఖైరతాబాద్ బ డా గణేశ్‌తో సహా పలు మండపాల వద్ద దర్శనానికి వచ్చిన మహిళలను వేధించిన 996 మంది ఆ కతాయిలను షీ టీమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై బీ ఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమో దు చేసి కోర్టులో హాజరుపరచనున్న ట్లు మహిళ భద్రతా విభాగం డీసీపీ ధారా కవిత శుక్రవారం తెలిపారు.