calender_icon.png 28 October, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సిబ్బందిపై దాడి

28-10-2024 06:49:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కరెంటు బిల్లు కట్టమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ షాపు యజమాని దాడికి పాల్పడారు. వివరాల్లోకి వెళితే... కుల్సంపుర పరిధిలో ఓ మొబైల్ షాపు యజమాని గత మూడు నెలలుగా కరెంటు బిల్లు కట్టడం లేదు. అయితే  లైన్ మెన్ శ్రీనివాస్ విద్యుత్ బిల్లు కట్టమని చెప్పాడు. లేకపోతే షాపుకు ఉన్న విద్యుత్ ను నిలిపివేస్తానని వెళ్లాడంతో షాపు యాజమని అడ్డగించాడు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. లైన్ మెన్ ఎంతకి విన్నకపోవడంతో షాప్ యాజమని మరో ముగ్గురు కలిసి లైన్ మెన్ శ్రీనివాస్ ను కొట్టారు. ఈ దాడిలో శ్రీనివాస్ కు తీవ్రగాయాలు అయ్యాయి.  స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు గాయపడ్డిన లైన్ మెన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లైన్ మెన్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.